ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్లో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించింది. ఈ ఫీచర్ మే 8 తర్వాత నుంచి అందుబాటులో ఉండదు. చాలా తక్కువమంది యూజర్లు మాత్రమే దీన్ని వాడుతున్నట్టు తెలిసింది. అందుకే ఈ ఫీచర్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెటా సపోర్ట్ పేజీ అప్డేట్ ఇచ్చింది. యాప్లో ప్రైవేట్ చాట్స్ ప్రాసెస్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సెండ్ చేసినవాళ్లు, రిసీవ్ చేసుకున్నవాళ్లు మాత్రమే మెసేజ్ చదవగలరు.
ప్లాట్ఫామ్ కూడా ఆ మెసేజ్ యాక్సెస్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఫీచర్ తొలగిస్తే పంపిన మెసేజ్లకు ఇకపై సేఫ్టీ ఉండదు. కంటెంట్ మోడరేషన్ లేదా ఇతర కారణాల వల్ల అవసరమైతే మెటా మీ మెసేజ్ చూడగలదు. ఇప్పటికే చాట్లు ఎన్క్రిప్ట్ చేసిన యూజర్లకు యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. పాత మెసేజ్లు లేదా మీడియాను సేఫ్టీ కోసం గడువు తేదీ ముగియకముందే డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది.
