హైదరాబాద్, వెలుగు: నల్సార్ లా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 15న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. వర్సిటీలో 58 పర్మినెంట్టీచింగ్ పోస్టుల భర్తీకి రిలీజ్చేసిన నోటిఫికేష్ను ఎ.శ్రీధర్ సవాల్ చేశారు.
మార్చి 15న ఇచ్చిన నోటిఫికేషన్ కు గడువు అదే నెల 31 వరకే ఇచ్చారని, వ్యవధి చాలా తక్కువ ఇచ్చారని పిటిషనర్ వాదన. ఈ రిట్పై జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. వర్సిటీ రిజిస్ట్రార్, ఇతరులు కౌంటర్ దాఖలు చేశాకే ఉత్తర్వుల జారీ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. నోటిఫికేషన్ ను అమలు చేయకుండా, పరీక్షలు నిర్వహించకుండా స్టే ఇవ్వలేమని చెప్పారు. విచారణను జూన్కు వాయిదా వేశారు.