రైతులతో ఇక మాటల్లేవ్​..

రైతులతో ఇక మాటల్లేవ్​..

తేల్చి చెప్పిన కేంద్రం.. 11వ రౌండ్​ చర్చలు ఫెయిల్​

న్యూఢిల్లీ/భోపాల్​: కొత్త అగ్రిచట్టాలపై ఢిల్లీలో 11వసారి కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరిగిన చర్చలు సక్సెస్​ కాలేదు. ఇక మీదట చర్చలు జరిగే అవకాశాలు తగ్గిపోయాయి. రైతులు ఎప్పట్లాగే చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. చట్టాలను 18 నెలలపాటు అమలు చేయకుండా ఆపుతామని, ఇంతకుమించి తాము చేయగలిగింది ఏమీ లేదని స్పష్టంగా చెప్పింది. ఈ ప్రపోజల్​కు ఒప్పుకుంటేనే తరువాతి రౌండ్​ చర్చలు ఉంటాయని పేర్కొంది. చట్టాల అమలును ఏడాదిన్నర ఆపాలన్న ప్రపోజల్​పై ఆలోచించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ రైతులకు నచ్చజెప్పారు.  చట్టాల్లో లోపం ఏమీ లేదని, అయినా సస్పెండ్​ చేసేందుకు ఒప్పుకున్నామని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 41 మంది రైతు సంఘాల లీడర్లు, కేంద్రమంత్రులు పీయూష్​ గోయల్​, సోమ్​ ప్రకాశ్​ చర్చల్లో పాల్గొన్నారు.  తాము తెచ్చిన ప్రపోజల్స్ బాగున్నాయని, అయినా వ్యతిరేకించడం సరికాదని మంత్రులు రైతులతో అన్నట్టు తెలిసింది. చట్టాల సస్పెన్షన్​తమకు సమ్మతం కాదని, పూర్తిగా రద్దు రైతులు చేయాలని కుండబద్దలు కొట్టారు.

ఆందోళన తీవ్ర తరం చేస్తాం: రైతులు

లంచ్‌ తర్వాత ఇరు వర్గాలూ తిరిగి భేటీ అయి అరగంట సేపు మాట్లాడుకున్నాయి.  మీటింగ్​ ముగిశాక భారతీయ కిసాన్​ యూనియన్​ లీడర్ జోగిందర్​ సింగ్​ ఉగ్రహన్​ మీడియాతో మాట్లాడుతూ చర్చలు ఫెయిలయినట్టు చెప్పారు.  మీటింగ్​ ఐదు గంటలపాటు సాగినా, మంత్రులు తమతోపాటు అరగంట సేపే మాట్లాడారని, మూడున్నర గంటలు వెయిట్​ చేయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.  26న ట్రాక్టర్‌‌ ర్యాలీని నిర్వహిస్తామని, ఆందోళన తీవ్రం చేస్తామని  ప్రకటించారు.

ఆందోళనలు కొనసాగాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి: తోమర్​

తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ‘శక్తులు’ రైతుల ఆందోళనలు కొనసాగాలని కోరుకుంటున్నాయని తోమర్​ మీడియాతో అన్నారు.  చట్టాల సస్పెన్షన్​కు ఒప్పుకుంటే శనివారం మరోసారి చర్చలకు రావాల్సిందిగా కోరామని
వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

మా బతుకులతో ఆడుకుంటున్నరు.. నర్సింగ్​ అభ్యర్థుల ఆందోళన