
చేవెళ్ల, వెలుగు: నాన్డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మూర్తుజగూడ లోని గొలమారి ఫామ్హౌస్లో, తొల్కట్ట శివారులోని గుల్మోర్ఫామ్హౌస్లో ఆదివారం నాన్డ్యూటీ పెయిడ్మద్యం వినియోగిస్తున్నారని ఎక్సైజ్పోలీసులు సమాచారం వచ్చింది. వారు వెంటనే అక్కడికి వెళ్లి, దాడులు చేశారు. గొలమారి ఫామ్హౌస్లో ఢిల్లీ, గోవా నుంచి తెచ్చిన 79 లిక్కర్ బాటిళ్లను సీజ్చేశారు.
వీటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. ఫంక్షన్చేసిన వ్యక్తితోపాటు మద్యం వినియోగానికి పర్మిషన్తీసుకోనందుకు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామన్నారు. గుల్మోర్ఫామ్హౌస్లో రూ.15 వేల విలువైన నాన్డ్యూటీ పెయిడ్లిక్కర్బాటిళ్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.