శంషాబాద్, వెలుగు: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని రోజులుగా దండగులు వరుసగా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా గురువారం ఈ ఎయిర్పోర్టుకు వస్తున్న సౌదీ అరేబియాకు చెందిన ఎయిర్బోర్న్ ఫ్లెనాస్ ఎయిర్లైన్స్ విమానంలో ఐదు ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టు మెయిల్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులను కిందకు దింపేసి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు, అర్జీఐఏ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులు
లేనట్లు గుర్తించారు.
