- సర్వీసులు షురూ
శంషాబాద్, వెలుగు: ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు డైరెక్టుగా ఫ్లైట్ సర్వీసులను అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఏఐ147 ఫ్లైట్ శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయలుదేరింది. ఏఐ 147 ఫ్లైట్ లండన్లోని హిత్రో ఎయిర్ పోర్టుకు వారానికి రెండుసార్లు(సోమ, శుక్ర) వెళ్తుందని అధికారులు తెలిపారు. ఏఐ148 ఫ్లైట్ లండన్ నుంచి ఆది, గురువారాల్లో తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరుతుందన్నారు. లండన్కు వెళ్లేందుకు నాన్ స్టాప్ సర్వీసులను ఎయిర్ ఇండియా అందిస్తోందని ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ తెలిపారు.