హైదరాబాద్ టు లండన్ నాన్ స్టాప్ ఫ్లైట్

హైదరాబాద్ టు లండన్ నాన్ స్టాప్ ఫ్లైట్
  • సర్వీసులు షురూ

శంషాబాద్, వెలుగు: ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్​పోర్టు నుంచి లండన్​కు డైరెక్టుగా  ఫ్లైట్ సర్వీసులను అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా  ఏఐ147  ఫ్లైట్ శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్​కు  బయలుదేరింది.   ఏఐ 147 ఫ్లైట్ లండన్​లోని హిత్రో ఎయిర్ పోర్టుకు వారానికి రెండుసార్లు(సోమ, శుక్ర) వెళ్తుందని అధికారులు తెలిపారు. ఏఐ148 ఫ్లైట్ లండన్ నుంచి ఆది, గురువారాల్లో తిరిగి  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరుతుందన్నారు. లండన్​కు వెళ్లేందుకు నాన్ స్టాప్ సర్వీసులను ఎయిర్ ఇండియా అందిస్తోందని  ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ తెలిపారు.