26 నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

26 నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో మిగిలి ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 3బీహెచ్ కే డీలక్స్, 3 బీహెచ్ కే, డబుల్,  సింగిల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ ( సీనియర్ సిటిజన్స్ ) ఫ్లాట్లు మొత్తం  924 ఉన్నట్లు నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు.

వేలంలో పాల్గొనేవారు 3 బీహెచ్ కే డీలక్స్, 3 బీహెచ్ కేలకు రూ.3లక్షలు, డబుల్ కు రూ.2లక్షలు, సింగిల్ కు రూ.1లక్ష టోకెన్ అమౌంట్ గా డీడీ తీయాలని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు బండ్లగూడలో 261 ఫ్లాట్లు, వచ్చే నెల 1 నుంచి 7 వరకు పోచారంలో 663 ఫ్లాట్లకు వేలం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.