దేశగతిని కేసీఆర్‌‌ మారుస్తరు

దేశగతిని కేసీఆర్‌‌ మారుస్తరు

హైదరాబాద్‌‌, వెలుగు: దేశ గతిని టీఆర్‌‌ఎస్‌‌ అధినేత కేసీఆర్‌‌ మార్చగలరని ఎన్‌‌ఆర్‌‌ఐలు అభిప్రాయపడ్డారు. టీఆర్‌‌ఎస్‌‌ ఎన్‌‌ఆర్‌‌ఐ సెల్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్‌‌ కాన్ఫరెన్స్‌‌లో ఆదివారం వివిధ దేశాల్లోని ఎన్‌‌ఆర్‌‌ఐలు పాల్గొన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ త్వరలోనే బీఆర్‌‌ఎస్‌‌గా మారనున్న నేపథ్యంలో సమావేశం నిర్వహిచారు. రాదనుకున్న తెలంగాణ సాధించిన కేసీఆర్‌‌.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని చెప్పారు. బంగారు తెలంగాణను తీర్చిదిద్దిన ఆయనే కేంద్ర రాజకీయాల్లోనూ గుణా త్మక మార్పు తీసుకురాగలరని అన్నారు. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌‌ నాయకత్వం అవసరమని, కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, దేశాన్ని తెలం గాణ లాంటి పాలన అందించగలరన్నారు.