హైదరాబాద్: పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎన్ఎస్యూఐ విద్యార్థులు ట్రాన్స్ కో ఆఫీసును ముట్టడించారు.అనంతరం విద్యుత్ సౌధ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్ చార్జీలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడుతుందన్నారు.పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంత సమయం పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ చార్జీలను పెంచిన @trspartyonline ప్రభుత్వానికి వ్యతిరేకంగా @TSNSUI అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రాన్స్ కో కార్యాలయాన్ని NSUI రాష్ట్ర కమిటీ ముట్టడించడం జరిగింది.#Adminpost pic.twitter.com/Div0O1pQhB
— Venkat Balmoor (@VenkatBalmoor) March 24, 2022