ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేం విడుదల

ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేం విడుదల

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 స్మారక నాణేంను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఆగస్టు 28న విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ కుటంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్  కుమారుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, పలు పార్టీల ప్రముఖులతో దాదాపు 200 మంది పాల్గొన్నారు.