నర్సింగ్​ విద్యార్థి హత్య కేసు.. అనిల్​ విచారణలో సంచలన విషయాలు

నర్సింగ్​ విద్యార్థి హత్య కేసు.. అనిల్​ విచారణలో సంచలన విషయాలు

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్​రి చెందిన నర్సింగ్​ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  జూన్​ 10 న రాత్రి ఆమె బావ అనిల్​కొట్టడంతో ఇంటి నుంచి బయటకి వెళ్లిపోయింది.  అనంతరం హత్యకు గురికావడంతో శిరీష బావ అనిల్​ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో..

అనిల్​ఫోన్లో శిరీష నంబర్​ డార్లింగ్​ అని సేవ్​ చేసి ఉంది. అనిల్​ఫోన్లో శిరీషకు హాయ్​ డార్లింగ్​ అనే మెసేజ్​లు పెట్టాడు.  ఇదే విషయం అనుమానాలకు తావిస్తోంది.  అతడ్ని విచారణ అనంతరం విడిచిపెట్టారు.  పోస్ట్​మార్టం అనంతరం డెడ్​బాడీని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు రీపోస్ట్​మార్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. యువతిపై హత్యాచారం జరిగిందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. డెడ్​ బాడీని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కాడ్లాపూర్​కి పోలీసులు చేరుకున్నారు. అంతకుముందే కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకున్నారు.