కొత్త సినిమాని అనౌన్స్ చేసిన నుస్రత్ భరూచా

కొత్త సినిమాని అనౌన్స్ చేసిన నుస్రత్ భరూచా

‘తాజ్‌‌‌‌మహల్’ అనే సినిమాతో టాలీవుడ్‌‌‌‌కి, ‘వలేబా రాజా’ మూవీతో కోలీవుడ్‌‌‌‌కి పరిచయమైన నుస్రత్ భరూచా.. బాలీవుడ్‌‌‌‌లో మాత్రం బోలెడన్ని సినిమాలు చేసింది. సోనూకే టీటూకీ స్వీటీ, డ్రీమ్‌‌‌‌గాళ్, జన్‌‌‌‌హిత్‌‌‌‌మే జారీ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌తో రామ్‌‌‌‌సేతు, సెల్ఫీ సినిమాలు చేస్తోంది. ఇప్పుడు తన కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. ‘అకేలీ’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌‌‌‌లో నటిస్తున్నట్టు చెబుతూ టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో చాలామంది ఇరాకీ మహిళలు ఉన్నారు. వాళ్లందరినీ ముందుండి నడిపిస్తోంది నుస్రత్. ఈ కథ మొత్తం ఇరాక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లోనే నడుస్తుంది. ఎడారి ప్రాంతంలో ఒక యువతిని బంధిస్తారు. ఆ ట్రాప్ నుంచి ఆమె ఒంటరిగా ఎలా బయటపడింది, తనలాంటి మరికొందరిని ఎలా సేవ్ చేసింది అనేది మెయిన్ పాయింట్. అందుకే అకేలీ (ఒంటరి) అనే పేరు ఫిక్స్ చేశారు. నుస్రత్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

క్వీన్, కమాండో 3 లాంటి చిత్రాలకు అసిస్టెంట్‌‌‌‌గా పని చేసిన ప్రణయ్ డైరెక్ట్ చేయడం, ఇటీవలి కాలంలో నుస్రత్ చేసే రోల్స్ అన్నీ చాలెంజింగ్‌‌‌‌గా ఉంటూండటంతో ఈ సినిమాపై ఆసక్తి కలుగుతోంది.