సారు.. కారు.. ఇక రాదు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

సారు.. కారు.. ఇక రాదు : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. సారు.. కారు ఇక రాదని ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఏఎస్ రావు నగర్ డివిజన్​లోని మార్కండేయ నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ భవన్​లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ జనాలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని ప్రభాకర్ తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మల్లాపూర్ డివిజన్​లో కార్యకర్తలతో కలిసి ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. శివ హోటల్ నుంచి భవానీనగర్, కేఎల్ఎన్ రెడ్డి నగర్, హెచ్ సీఎల్ కాలనీ, సూర్య నగర్, గోకుల్ నగర్ కాలనీల్లో పాదయాత్ర చేశారు.