
బులవాయో (జింబాబ్వే): వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో వరుసగా రెండో విక్టరీ సాధించిన శ్రీలంక గ్రూప్–బిలో టాప్ ప్లేస్కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లంక 10 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 30.2 ఓవర్లలో 98 రన్స్కే ఆలౌటైంది. అయాన్ ఖాన్ (44) టాప్ స్కోరర్. వానిందు హసరంగ ఐదు వికెట్లు తీయగా... లాహిరు కుమార మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత దిముత్ కరుణరత్నె (61 నాటౌట్), పాథుమ్ నిశాంక (37 నాటౌట్) మెరుపులతో లంక 15 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 రన్స్ చేసి గెలిచింది. ఇదే గ్రూప్లో స్కాట్లాండ్ కూడా రెండో విక్టరీ ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్లో 111 రన్స్ తేడాతో యూఏఈ జట్టును చిత్తుగా ఓడించింది.