నవంబర్‌ 30 వరకు ఒడిశాలో లాక్‌డౌన్

నవంబర్‌ 30 వరకు ఒడిశాలో లాక్‌డౌన్

ఒడిశాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో లాక్‌డౌన్ గ‌డువును మ‌రింత పొడిగించాల‌ని ఒడిశా ప్రభుత్వం నిర్ణ‌యించింది. న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు శనివారం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్  జోన్‌ల‌కు ఈ లాక్‌డౌన్ పొడిగింపు వ‌ర్తిస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అదేవిధంగా న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లను మూసే ఉంచాల‌ని ఒడిశా ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే… 9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్రం న‌వంబ‌ర్ 16 నుంచి ఆయా పాఠ‌శాల‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టంచేసింది.

ఒడిశాలో ఇప్పటివరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా… అందులో 273,838 మంది డిశ్చార్జ్ అయ్యారు.