ఆఫీసుల అద్దెలు జూమ్.. ముంబైలో 28 శాతం పెరుగుదల.. హైదరాబాద్‌‌‌‌లో 24 శాతం జంప్

ఆఫీసుల అద్దెలు జూమ్.. ముంబైలో 28 శాతం పెరుగుదల.. హైదరాబాద్‌‌‌‌లో 24 శాతం జంప్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రధాన ఆఫీస్​ స్థలాలకు గిరాకీ తగ్గడం లేదు. గత రెండున్నర సంవత్సరాల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌‌‌‌లో ఆఫీస్​ అద్దె 28 శాతం పెరిగిందని అనరాక్ తెలిపింది. వర్క్​ఫ్రం హోమ్‌ విధానం చాలా వరకు తగ్గడంతో ఆఫీసులు కళకళలాడుతున్నాయి. అనరాక్ రిపోర్ట్​ ప్రకారం..  ముంబైలో, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు,  బీమా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫీసులను లీజుకు తీసుకుంటున్నాయి.

ప్రీమియం, గ్రేడ్ ఎ ఆఫీస్​ స్థలాల కోసం అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌‌‌‌లో, సగటు నెలవారీ ఆఫీస్​ అద్దె 2022లో చదరపు అడుగుకు రూ.131 నుంచి చదరపు అడుగుకు రూ.168 పెరిగింది. ఢిల్లీ-ఎన్‌‌‌‌సిఆర్‌‌‌‌లో అద్దె రూ.92  నుంచి రూ.110 లకు పెరిగింది. హైదరాబాద్ ఆఫీస్​ అద్దె 24.1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.58  నుంచి రూ.72 లకు పెరిగింది.