ఈ దేశం వదలి వెళ్ళిపో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్: బండి సంజయ్

ఈ దేశం వదలి వెళ్ళిపో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్: బండి సంజయ్

వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ రావు పెద్ద అవినీతి పరుడు అని విమర్శించారు. ‘ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడారట. మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో ఎందుకు ఇక్కడ బతకడం’ అని వ్యాఖ్యానించారు. ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా అని ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్ లో కూడా  శ్రీనివాస్ రావు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.  శ్రీనివాస్ రావు అవినీతిని రుజువు చేసి చూపిస్తామని చెప్పారు. 

ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయని డీహెచ్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డీహెచ్ శ్రీనివాసరావు...ఈ కామెంట్స్ చేశారు. మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్దిని నేర్పిందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమన్నారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని..దానిని అందరూ ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ‘భూమి మీద నడియాడిన నేల ఉందంటే అది ఏసుక్రీస్తు మాత్రమే. దీనిని అందరూ అర్థం చేసుకోవాలి. గ్రాఫిక్స్ లేక ఇంకో రూపంలో చూడలేదు. పూర్వీకులు చూశారు. వారు ఇచ్చిన సందేశాన్ని మన వరకు చేరవేస్తున్నారు.