- సీఎం బర్త్డేకు కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో మొక్కలు నాటించిన ఆఫీసర్లు
ఖానాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్రమంతా మొక్కలు నాటాలని నిర్ణయించారు. అయితే ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన ప్లాంటేషన్ ప్రోగ్రాం విమర్శలకు తావిచ్చింది. మొక్కలు నాటేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులను వాడుకోవడమే ఇందుకు కారణం. స్థానిక ఆఫీసర్లు ఎప్పుడో రిలీజ్ అయిన చెక్కులను ఆపి అందరినీ బుధవారం ఖానాపూర్ మార్కెట్ కమిటీ ఆఫీస్కు పిలిపించారు. చెక్కులు ఇవ్వాలంటే ముందు అంతా ‘మొక్కల టార్గెట్’ను కంప్లీట్ చేయాలని హుకుం జారీ చేశారు. మహిళలంతా మండుటెండలోనే మొక్కలు నాటారు. తాము చేయాల్సిన పనులను లబ్ధిదారులతో చేయించి అధికారులు నేతల దృష్టిలో పడిపోయినట్లు తెగ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రేఖానాయక్ అక్కడికి చేరుకుని చెక్కులు పంపిణీ చేశారు. అధికారుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ లీడర్లు ఎంపీపీ అబ్దుల్ మోహిద్, కౌన్సిలర్ షబ్బీర్ పాషా అక్కడి నుంచి వెళ్లిపోయారు.