- టెక్నికల్ సమస్యలు తీరాయంటున్న హెచ్ఎండీఏ
- కమిషనర్ ఆదేశాలతో పెండింగ్ఫైల్స్ క్లియర్ చేస్తున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన క్లియర్చేయాలని కమిషనర్సర్ఫరాజ్అహ్మద్ఆదేశాలతో అధికారులంతా ఆ పనిలో పడ్డారు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కానీ, కొన్ని సమస్యలతో వాటిని పెండింగ్ లో పెట్టిన అధికారులు ఇప్పుడు క్లియరెన్స్పై దృష్టి పెట్టారు.
ఇంతకాలం ఒక ప్లానింగ్ అధికారి పరిధిలో ఒక్కరికే వెబ్ సైట్ లో లాగిన్ అయ్యే అవకాశం ఉండడం వల్ల పరిశీలనలో తీవ్ర జాప్యం జరిగిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలించి వెంటనే అవసరమైన సొమ్ము వసూలు చేసి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్ పల్లి జోన్ల పరిధి నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు.
రెండేండ్లలో 2.23 లక్షల దరఖాస్తులు
ఎల్ఆర్ఎస్స్కీమ్ప్రకటించిన తర్వాత ఎప్పటికప్పుడు దరఖాస్తులను క్లియరెన్స్చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. గత రెండేండ్లలో 2.23 లక్షల దరఖాస్తులు రాగా, 62 వేల మందికి అవసరమైన ఫీజులు చెల్లించాల్సిందిగా సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. ఇందులో 30 వేల దరఖాస్తులను ఈ ఏడాదే అప్రూవ్చేశామన్నారు. అలాగే, మరో 27, 479 షార్ట్లిస్ట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం 1.95,491 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. త్వరలోనే వీటిని కూడా క్లియర్ చేయనున్నట్టు చెప్పారు.
ఎల్ఆర్ఎస్ఎవరికి వర్తిస్తుందంటే...
2020కి ముందు వేసిన అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారే తాజా మార్గదర్శకాల ప్రకారం రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారే ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, అక్రమ లేఅవుట్లలో కనీసం 10శాతం ప్లాట్లు విక్రయించి ఉంటేనే మిగిలిన ప్లాట్లను క్రమబద్దీకరించడానికి అవకాశం ఉంటుంది. అయితే,10శాతం విక్రయాలు జరగని లేఅవుట్లకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంటున్నారు.
వీటిని పెండింగ్లో ఉంచినట్టు చెప్పారు. ఆలయ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు ఉంటే.. వాటిని గతంలో రిజిస్ట్రేషన్లు చేసినప్పటికీ క్రమబద్ధీకరణకు అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి సమస్యలున్నా ప్లాట్లు, లేఅవుట్లను ఫీల్డ్లెవెల్లో పరిశీలించాల్సి ఉంటుందని, రూల్స్ప్రకారం అన్ని అప్లికేషన్లను పరిశీలించిన తర్వాతనే క్రమబద్ధీకరణ ప్రాసెస్ చేస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
