
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్కు వరద తగ్గుతుండటంతో అధికారులు బుధవారం డ్యాం క్రస్ట్ గేట్లను క్లోజ్ చేశారు. మొన్నటి వరకు ఎగువ నుంచి ఇన్ఫ్లో భారీగా ఉండటంతో ఈ నెల 5న క్రస్ట్ గేట్లను ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 2 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించగా ఆ తరువాత మధ్యాహ్నం ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గ డంతో మిగతా గేట్లను మూసేశారు. వరద ఉధృతిని బట్టి నీటి విడుదల చేపడుతామని అధికారులు తెలిపారు.