సిద్దిపేటలో పర్యటించిన వివిధ రాష్ట్రాల అధికారులు

సిద్దిపేటలో పర్యటించిన వివిధ రాష్ట్రాల అధికారులు

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట అభివృద్ధి భేష్ అని వివిధ రాష్ట్రాల అధికారులు, నారాయణఖేడ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అన్నారు. శనివారం ఈపీటీఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఛత్తీస్​గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో పాటు, నారాయణఖేడ్ మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు సిద్దిపేటలో పర్యటించారు.

ముందుగా సిద్దిపేటలో ఉన్న స్వచ్ఛ బడి, బుస్సాపూర్ లో ఉన్న బయో సీఎన్జీ ప్లాంట్ ను సందర్శించారు. స్వచ్ఛ బడి లో డ్రై వేస్ట్ తయారీ పై సిబ్బంది వారికి అవగహన కల్పించగా, బుస్సాపూర్ డంప్ యార్డ్ లో జరిగే బయో సీఎన్ జీ అండ్ ఆర్గానిక్ ప్లాంట్ లో వేస్ట్ ప్రాసెస్ పై అధికారులు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, 39 వ వార్డు కౌన్సిలర్, వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.