స్కై వేల నిర్మాణాలపై ఫోకస్​  ల్యాండ్ డీ-మార్కేషన్​ పనులు వేగం

స్కై వేల నిర్మాణాలపై ఫోకస్​  ల్యాండ్ డీ-మార్కేషన్​ పనులు వేగం

కంటోన్మెంట్​, వెలుగు: సికింద్రాబాద్​నుంచి  హకీంపేట్ ఎయిర్​ఫోర్స్​స్టేషన్​వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు స్కైవేల నిర్మాణాల కావలసిన స్థల సేకరణపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, మిలటరీ అథారిటీలోని స్థలాలను ఇచ్చేందుకు సమ్మతించింది.  దీంతో సికింద్రాబాద్ ​జింఖానా గ్రౌండ్ నుంచి హకీంపేట్ ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​ వరకు 18 కిలో మీటర్ల పొడవుతో ఎలివేటెడ్ స్కైవే పనులను స్పీడప్ అయ్యాయి. అయితే.. మూడు ప్రాంతాల్లో స్కేవేకు ఇరువైపులా ఎంట్రీ, ఎగ్జిట్​ర్యాంపులు నిర్మించాలని నిర్ణయించారు.

ఇప్పటికే అధికారులు ల్యాండ్​డీ మార్కేషన్​పనులు చేపట్టారు.  స్కైవే బ్లూ ప్రింట్​ప్రకారం..  కార్ఖానా, తిరుమలగిరి,అల్వాల్​ ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ కు మార్కింగ్ చేశారు.  మరోవైపు ఇరువైపులా సర్వీసు రోడ్లకు  స్థల సేకరణను అధికారులు చేపట్టారు.  మరోవైపు ఈ ప్రాంతంలో భూములు కోల్పోతున్న  వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు.  తమకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని,  లేదా స్కైవే ను రీ -డిజైన్ చేయాలని కోరుతున్నారు.

రెండున్న కిలోమీటర్లలో 300 ప్రాపర్టీలు

రక్షణమంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్థలాలతో పాటు  సికింద్రాబాద్​జూబ్లీ బస్​స్టేషన్​నుంచి తిరుమలగిరి వరకు సేకరించిన 2.5 కిలో మీటర్ల  స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి. ఇందులో సుమారు 300 మంది భూ నిర్వాసితులు ఉన్నారు. వీళ్లకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు.  ఈ ప్రాంతంలో  ఆరు దశాబ్దాల నుంచి ఉంటున్నామని,  ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ  బతుకుతున్నామని,  స్కైవే నిర్మాణం వల్ల తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని తిరుమలగిరి, కార్ఖానా, లాల్​బజార్​ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తమకు సరైన నష్టపరిహారం అందేలా చూడాలని,  లేకుంటే స్కైవేల డిజైన్​మార్చాలని కోరుతున్నారు.  

ప్రాపర్టీ ఓనర్లకు నష్టపరిహారం న్యాయంగా ఇవ్వాలి 

స్కైవేల నిర్మాణంలో సికింద్రాబాద్​ కార్ఖానా, వాసవీ నగర్ ప్రాంతంలో ఎక్కువ మంది వ్యాపారులు స్థలాలు కోల్పోతున్నారు. జేబీఎస్​నుంచి తిరుమలగిరి వరకు రెండున్నర కిలో మీటర్లమేర ప్రైవేటు స్థలాలు ఉన్నాయని, వారందరికి మార్కెట్ వాల్యూ ప్రకారంగా రావాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ల్యాండ్ ​డీ మార్కేషన్​కు ముందే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
– తేలుకుంట సతీశ్​​గుప్తా,  వాసవి నగర్​ సంక్షేమ సంఘం అధ్యక్షుడు