బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు. 11 మంది విద్యార్థులకు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 

కాగా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం E 1, E 2 మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదిలాఉంటే ఫుడ్ పాయిజన్ విషయం బయటకు రాకుండా అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్థులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆహారం నాసిరకంగా ఉంటోందంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.