క్రికెట్ అభిమానులకు విద్యుత్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంకు కరెంట్ ను పునరుద్ధరించింది. కరెంటు బిల్లు కట్టలేదని ఉప్పల్ స్టేడియంకు కరెంట్ సప్లైని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గత ఫిబ్రవరి 20న విద్యుత్ అధికారులు హెచ్సీఏకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ హెచ్సీఏ స్పందించక పోవడంతో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు.
ముందే హెచ్చరించినా హెచ్సీఏ అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో విద్యుత్ శాఖ తీవ్ర చర్యలు చేపట్టింది. అయితే, శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఒక్కరోజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు విద్యుత్శాఖఅధికారులు గురువారం రాత్రి స్టేడియంకు విద్యుత్ను పునరుద్ధరించారు. క్రికెట్అభిమానులు నిరుత్సాహపడొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.