
హైదరాబాద్, వెలుగు: ఆఫ్షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ బైండ్జ్, భారత్లో తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్లో శుక్రవారం తమ రెండో డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. ఆఫ్షోర్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, కంప్లైయన్స్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి దీనిని ఏర్పాటుచేసింది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్యలో ఉన్న ఈ ఆఫీసు క్లయింట్లకు అధిక- నాణ్యత, అత్యాధునిక టెక్నాలజీలతో ఫైనాన్షియల్ సొల్యూషన్లను అందిస్తుంది.
పన్ను, సలహా, వాల్యుయేషన్, క్లయింట్ అకౌంటింగ్ , కంప్లయన్స్, టెక్నాలజీ సేవలను అందిస్తామని ఈ సందర్భంగా బైండ్జ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శిరీష్ కొరడా చెప్పారు. ఈ విస్తరణతో కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని రెండు ప్రధాన డెలివరీ హబ్లలో సేవలు అందిస్తోందని అన్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని క్లయింట్ల నుంచి పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ను తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.