ముంబై: ఓలా కంపెనీ తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటీ అనూహ్యమైన రికార్డ్ సృష్టించింది. లాంచ్ కంటే ముందు ఓపెన్ చేసి ప్రీ బుకింగ్స్కు భారీ స్పందన వచ్చింది. కేవలం 24 గంటల్లోనే లక్ష మంది స్కూటీ కొనేందుకు బుకింగ్ చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే స్కూటీ ప్రీ బుకింగ్స్లో హయ్యెస్ట్ రికార్డ్ అని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ అన్నారు. కేవలం 499 రూపాయల టోకెన్ అమౌంట్ కట్టి, ఎలక్ట్రిక్ స్కూటీ బుక్ చేసుకోవచ్చని కొద్ది రోజుల క్రితం అఫీషియల్ వెబ్ సైట్లో చేసిన ప్రకటనకు జులై 15న ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాగానే తాము ఊహించని స్థాయిలో స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ రెవల్యూషన్ ఒక విస్పోటంలా భారీ రేంజ్లో స్టార్ట్ అయిందని భవిష్ అన్నారు. ఓలా ఈస్కూటీ కొనేందకు రిజర్వ్ చేసుకున్న లక్ష మందికి పైగా రెవల్యూషనరీస్కు థ్యాంక్స్, ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంకా మార్కెట్లోకి రాని తమ ఎలక్ట్రిక్ స్కూటీ కొనేందుకు మన దేశ ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి తాను థ్రిల్ అయ్యానని, ఇంత మంది ఒక్కసారిగా బుక్ చేసుకోవడమంటే పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారని క్లియర్గా తెలుస్తోందని పేర్కొన్నారు. కాగా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ నెలాఖరులో మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనికి కీతో కూడా పని లేకుండా స్పెషల్ ఫీచర్తో రాబోతోంది. ఫోన్ యాప్తో స్కూటీ కీని అన్లాక్ చేసుకోవచ్చు.
India’s EV revolution is off to an explosive start. ??? Huge thanks to the 100,000+ revolutionaries who’ve joined us and reserved their scooter. If you haven’t already, #JoinTheRevolution at https://t.co/lzUzbWbFl7 @olaelectric pic.twitter.com/LpGbMJbjxi
— Bhavish Aggarwal (@bhash) July 17, 2021