ఓం భీమ్ బుష్.. కథలోనే ఆ మ్యాజిక్ ఉంది

ఓం భీమ్ బుష్.. కథలోనే ఆ మ్యాజిక్ ఉంది

హుషారు, రౌడీబాయ్స్ తర్వాత దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా  వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 22న విడుదలవుతోంది. ఈ  సందర్భంగా శ్రీహర్ష  మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. ముగ్గురు హీరోల పాత్రలు హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. ఫిక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా జోడించాం. గుప్తనిధుల బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కథ ఉంటుంది.  ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు మన దగ్గర  ఉన్న డబ్బు, బంగారం ఒక బిందెలో పెట్టి భూమిలో  దాచేవారు.

అలాంటి గుప్తనిధుల కోసం ముగ్గురు యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ చేసిన అన్వేషణను క్రేజీగా చూపించాం.  టైటిల్‌‌‌‌‌‌‌‌ తరహాలోనే కథలోనూ మ్యాజిక్ ఉంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు లాంటి మిస్టీరియస్ అంశాలు ఉన్నాయి.  మొదటి షాట్ నుంచి చివరి వరకూ ఓ లాఫ్ రైడ్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు.  శ్రీవిష్ణు గత చిత్రం  ‘సామజవరగమన’ ప్రేక్షకులని ఏ విధంగా నవ్వించిందో.. దానికి పది రెట్లు ఈ చిత్రానికి నవ్వుతారు’ అని చెప్పాడు.