గాంధీభవన్ లో వెంకటస్వామికి కాంగ్రెస్ నేతల నివాళి

గాంధీభవన్ లో వెంకటస్వామికి కాంగ్రెస్ నేతల నివాళి

ఇవాళ కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి వర్ధంతి. ఈ సందర్బంగా గాంధీభవన్ లో వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి దిగ్విజయ్ సింగ్ నివాళులర్పించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పూలమాల వేసి, నివాళులర్పించారు. వెంకటస్వామికి నివాళులర్పించిన వారిలో కుమార్ రావు, సుధీర్ రెడ్డి, మెట్టు సాయి ఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వెంకటస్వామి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.