పీవీకి సీఎం కేేసీఆర్ ఘన నివాళి

పీవీకి సీఎం కేేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్: రేపు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... క్లిష్ట సమయాల్లో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి... దేశాన్ని కాపాడిన  ఆధునిక భారతదేశ నిర్మాత పీవీ నర్సింహారావు అని కొనియాడారు. ప్రధానిగా పీవీ దేశాన్ని ఆర్థిక రంగంతో పాటు అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో కూడా పరుగులు పెట్టించారన్నారు. వినూత్న విధానాలతో దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి... తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో  ఇమిడి ఉందని సీఎం అన్నారు. నాయకత్వ దార్శనికతలో పీవీ దేశానికి దిక్సూచిగా నిలిచారని తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన  స్పూర్తితో ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు.