కుప్పంలో మూడంచెల భద్రత ఏర్పాటు

కుప్పంలో మూడంచెల భద్రత ఏర్పాటు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే నిన్న జరిగిన ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడో రోజు చంద్రబాబు పర్యటనలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు గతంలో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత ఉంటే.. ఈసారి నుంచి డీఐజీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో సెక్యూరిటీ ఉండనుంది. అలాగే NSG ఆఫీసర్లు అమరావతి వచ్చి చంద్రబాబు భద్రతపై రివ్యూ చేశారు. ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అయితే ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. కుప్పంలో నిన్న జరిగిన పరిణామాలపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడిచింది.