రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు ఆవులపై దాడి చేసింది చిరుత. దీంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు… చిరుత కాలు ముద్రలను చూసి… అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజేంద్రనగర్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే ఆరు నెలలుగా చిరుత రాజేంద్రనగర్ అటవీలో తిరుగుతున్న కూడా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు స్థానికులు… వెంటనే సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసి… చిరుతను పట్టుకోవాలంటున్నారు.