ఏపీలో 520  కేజీల గంజాయి పట్టివేత

ఏపీలో 520  కేజీల గంజాయి పట్టివేత

విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న  కోటి రూపాయిల విలువైన 520 కిలోల గంజాయిని  సీజ్ చేశారు. అరకు నుంచి విశాఖకు బొలోరో వాహనంలో తరలిస్తుండగా.. బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లను అరికట్టేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.