![పీఎఫ్ డబ్బు తీసుకోవడం కష్టమే ..ఎందుకంటే.?](https://static.v6velugu.com/uploads/2024/02/30_KOfX0Sks9V.jpg)
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) .. తనకు వచ్చిన ప్రతి మూడవ లోన్క్లెయిమ్ను తిరస్కరించినట్లు వెల్లడైంది. ఈ విషయమై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం మొత్తం 73.87 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 33.8 శాతం (24.93 లక్షలు) అప్లికేషన్లను తిరస్కరించారు.
అయితే 46.66 లక్షలు క్లెయిమ్స్ను సెటిల్ చేశారు. 2017-18, 2018-19లో ఉన్న రిజెక్షన్ రేటు కంటే ఇది చాలా ఎక్కువ. ఫైనల్సెటిల్మెంట్ క్లెయిమ్ల కోసం రిజెక్షన్లు 2019-20లో 24.1 శాతం ఉండగా, 2020-21లో 30.8 శాతానికి పెరిగాయి. 2021-22లో ఇది 35.2 శాతానికి చేరింది. అయితే తమపై విపరీతంగా పనిభారం ఉందని ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అంటున్నారు.