కారును గూడ్స్ రైలు ఢీ కొని ఒకరి మృతి

కారును గూడ్స్ రైలు ఢీ కొని ఒకరి మృతి

కడప జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఎర్రగుట్ల మండలం వై. కోడూరు దగ్గర గూడ్స్ రైలు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా..మరొకరి తీవ్రంగా గాయాలయ్యాయి. వై. కోడూరు దగ్గర  కారు రైల్వే ట్రాక్ దాటుతుండగా సడన్ గా ట్రాక్ పై ఆగిపోయింది. అదే టైంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ రైలు ఇంజన్ కారును ఢీ కొంది.  విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో చనిపోయన వ్యక్తి వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ప్రోద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గూడ్స్ రైలు ఇంజన్… భారతీ సిమెంట్ ప్యాక్టరీలో వాగిన్లను వదిలి వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.