క‌రీంన‌గ‌ర్ లో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

క‌రీంన‌గ‌ర్ లో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

కరీంనగర్‌ జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కరీంనగర్ కు మత ప్రచారం కోసం వచ్చిన ఇండోనేషియన్లను రామగుండం నుంచి ఆటోలో తీసుకువచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. దీంతో ఇండోనేషియన్లు కాకుండా జిల్లాలో కరోనా సోకినవారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు జిల్లాలో ఇండోనేషియన్లకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి, అతని తల్లి, సోదరిలకు కరోనా పాజిటివ్‌ తేలిన సంగతి తెలిసిందే.

కాగా, ఢిల్లీ నుంచి రైలులో రామగుండం వచ్చిన ఇండోనేషిన్లు.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్‌ చేరుకున్నారు. కరీంనగర్‌లో పలు ప్రాంతాల్లో సంచరించారు. అయితే వారికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి కరోనా పాజటివ్‌ తేలడంతో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రజల సహకారంతో 14 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా పూర్తయిందని.. ఇంకా ప్రమాదం ఉన్నందున మరో 14 రోజులు ప్రజలు సహకరించాలని తెలిపారు. లేదంటే మళ్లీ వ్యాధి విజృంభించే ప్రమాదం ఉందన్నారు కలెక్టర్‌ శశాంక.