కూల్ అండ్ క్లాస్ రోల్స్ చేయడంలో శర్వానంద్ ఎక్స్పర్ట్. మరోసారి అలాంటి క్యారెక్టర్నే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో పోషించాడు. రష్మిక మందాన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి వంటి సీనియర్ యాక్టర్స్తో పాటు వెన్నెల కిశోర్, రవిశంకర్, సత్య, రాజశ్రీ నాయర్ తదితరులు కూడా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చ్ 4న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘మాంగల్యం’ అనే పాటను నిన్న రిలీజ్ చేశారు. పెళ్లి మంత్రాన్ని మోడ్రనైజ్ చేసి ఈ పాటను కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. లిరిక్స్ కూడా తానే రాశాడు. జస్ప్రీత్ జాస్ ఆకట్టుకునేలా పాడాడు. పెళ్లి కావట్లేదనే ఫ్రస్ట్రేషన్లో శర్వా పాడుకుంటున్న పాట ఇది. తన ఎక్స్ప్రెషన్స్తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ కూడా సింపుల్గా ఉండి
అట్రాక్ట్ చేశాయి.