బిల్డింగ్​పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడి మృతి

బిల్డింగ్​పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడి మృతి

మూసాపేట, వెలుగు: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు చనిపోయిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన రోహిత్(24)  కొంతకాలంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వీఎన్​ఆర్ కాలేజ్ సమీపంలోని వాసవి అర్బన్ కన్​స్ట్రక్షన్ కంపెనీలో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

బుధవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ 4వ అంతస్తులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.