
గండిపేట్, వెలుగు: ఒడిశా నుంచి పుణెకు భారీగా గంజాయి తరలిస్తుండగా హైదరాబాద్లో రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. పుణెకు చెందిన ప్రశాంత్గణేశ్(29), లతాగణేశ్(40), సచిన్ దిలీప్రణవారే(37), రోహన్ పాండురంగ్ పవార్, రాహుల్ బాబురావు ధవ్రే(28), గౌరవ్ నటేకర్(26), పవన్ దీప్ ఒడిశాలో 108 కిలోల గంజాయి కొన్నారు.
సరుకును విశాఖపట్నం, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్ మీదుగా పుణెకు తరలించేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు కార్లలో వెళ్తుండగా ఓఆర్ఆర్ టోల్ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద రాజేంద్రనగర్పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని 108 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కార్లతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ.9,700 సీజ్ చేశారు.