175 మంది విద్యార్థులకు ఒక్క టాయిలెట్

175 మంది విద్యార్థులకు ఒక్క టాయిలెట్

విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే పాఠశాలల్లో సౌలత్‌లు లేవు
బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్​ఇన్‌చార్జి అందెల శ్రీరాములు 

బండంగ్ పేట్, వెలుగు: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం ఆaర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ఉర్దూ పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు సతమవుతున్నారు.ఎన్టీఆర్ నగర్ లో బీజేపీ నేత అందెల శ్రీరాములు సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్‌‌లోని ఉర్దూ పాఠశాల హెచ్ఎం పాఠశాల సమస్యలు అందెల శ్రీరాములుకు తెలిపారు.  పాఠశాలలో 175 మంది విద్యార్థులు చదివితే వారికి ఒకే బాత్రూం ఉందని, సరిపడ టీచర్లు లేరని ఎన్ని సార్లు ప్రభుత్వానికి, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు.  

రెండు గదుల్లో అన్ని తరగతులను కలిపి బోధించటంపై ఆయన మంత్రి సబితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి సబిత సొంత ఇలాకాలోనే బడుల్లో టాయిలెట్స్, సిబ్బంది లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వ పాఠశాల నిర్వహణ ఉందో అర్థం చేసుకోవచ్చని  విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.