కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిగడ్డ..హోటల్స్ లో నో ఆనియన్ బోర్డ్స్

కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిగడ్డ..హోటల్స్ లో  నో ఆనియన్  బోర్డ్స్

సామాన్యులకు మొన్నటి వరకు టమాటా కన్నీళ్లు పెట్టించింది ..తాజాగా ఇప్పుడు  ఉల్లిగడ్డ వంతు వచ్చింది. ఈ మధ్య భారీగా ఉల్లి ధరలు పెరగడంతో సగటు సామాన్యుడికీ ఉల్లి కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉల్లిగడ్డ రేటు కేజీ వంద రూపాయిలకు చేరుకోవడంతో హోటల్స్ లో నో ఆనియన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

సర్వ సాధారణంగా మనం తినే ప్రతి కూరలో ఉల్లిగడ్డ లేనిదీ అస్సలు కూరే ఉండదు, ప్రతి కూరల్లో ఉల్లికి చాలా ప్రాధాన్యం ఉంటుంది.అలాంటి ఉల్లి ధర ఇప్పుడు మరోసారి కొండెక్కి కూర్చుంది. సామాన్య గృహిణిలకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది.

ప్రస్తుతం కిలో ఉల్లి వంద రూపాయల వైపు పరుగులు పెడుతోంది. రిటైల్‌ మార్కెట్‌, లోకల్ మార్కెట్ లో  నాణ్యత కలిగిన తెల్ల ఉల్లి గడ్డ ధర కిలో.రూ.85 నుండి 90 వరకు పలికింది. ఇక ఎర్ర ఉల్లి గడ్డ ధర కిలో రూ.70 నుండి 80 మద్య వరకు పలుకుతోంది. ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లిని అధికంగా పండిస్తుండగా.. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతి అవుతుంది.

ఈ ఏడాది వర్షాలతో పంట నష్టం ఎక్కువ ఏర్పడటం, కొత్త పంట దిగుబడులు మార్కెట్‌కు ఎక్కువగా రాకపోగా..పాత నిల్వలు తగ్గడంతో ఉల్లి ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో ఉల్లిగడ్డ కిలో రూ.30 ఉండగా,రెండు నెలల్లో అమాంతం పెరిగింది. మార్కెట్‌లో ఉల్లి ధర రోజు రోజుకు పెరిగి పోతుండటంతో కొనలేక, తినలేక దాని వాడకాన్ని తగ్గించుకునే పరిస్థితి సామాన్య ప్రజలకు ఏర్పడింది.

నగరాల్లో కొన్ని స్ట్రీట్ ఫుడ్‌ స్టాల్స్‌లో,హోటళ్లు,మరియు ఇతర ఆహార పదార్థ స్టాల్స్ లో .. నో ఆనియన్ బోర్డులు పెడుతున్నారు. ఉల్లి ధర తగ్గేవరకు ఉల్లిగడ్డ కొనకపోవటం, తినక పోవటమే మంచిదనే అభిప్రాయానికి సామాన్యుడు వారి కుటుంబాలు ఈ నిర్ణయానికి వస్తున్నారు.నవంబరు నెలాఖరు వరకు ఉల్లి రేటు పై ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుదని.ఆ తర్వాత ఉల్లి ధరలు తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.