ఎలక్షన్స్ కు ఒక్క రోజే టైం.. కార్లలో తరలిస్తున్న రూ.కోటి సీజ్

ఎలక్షన్స్ కు ఒక్క రోజే టైం.. కార్లలో తరలిస్తున్న రూ.కోటి సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల పోటాపోటీగా భారీగా నగదు, ఉచితాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న రూ.1కోటి 68 లక్షల 80 వేల నగదును రాయదుర్గం, మాదాపూర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అందులో భాగంగా ఖాజాగూడాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఈ నగదును కార్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సీజ్ చేసిన నగదును రాయదుర్గం పోలిసులు శేరిలింగంపల్లి అర్ఓ అధికారికి అప్పగించినట్టు సమాచారం. పోలీసులకు పట్టుబడిన నగదులో ఎక్కువ శాతం రూ.500కరెన్సీ నోట్లు, కొన్ని రూ.100నోట్లు ఉన్నాయి. ఏపీ11ఏపీ(AP11AP) 2098 నెంబర్ గల ఓ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.