ఊట్కూర్‌‌లో టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు సవరించాలి : నరసింహ

ఊట్కూర్‌‌లో టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు సవరించాలి : నరసింహ

ఊట్కూర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అభ్యసన సామర్థ్యాల పెంపునకు టీచర్లే బాధ్యత వహించాలని చెప్పిన అధికారులు సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడం దారుణమని తపస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే సవరించాలన్నారు. 

పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని, 30 మంది లోపు విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు, 60 వరకు ఉంటే నలుగురు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. టీచర్ల సర్దుబాటు అంశాన్ని బడిబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత పరిశీలించాలన్నారు. విద్యార్థుల ఎక్కువగా ఉండి, అదనంగా టీచర్లు అవసరమైన చోట అవసరమైతే విద్యావలంటీర్లను  నియమించాలని పేర్కొన్నారు.