ఓపెన్ టెన్త్, ఇంటర్..సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఓపెన్ టెన్త్, ఇంటర్..సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
  • టెన్త్​లో 48.86% , ఇంటర్​లో 58.21% మంది పాస్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఎస్సీలో 48.86% , ఇంటర్ లో 58.21% మంది స్టూడెంట్లు పాసయ్యారు.

 ఈ మేరకు గురువారం టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఫలితాలను సొసైటీ వెబ్ సైట్​ www.telanganaopenschool.org లో పెట్టారు. గతనెల 22 నుంచి 28 వరకూ పరీక్షలు జరిగాయి.ఎస్ఎస్సీలో మొత్తం 9,717 మంది పరీక్షకు హాజరుకాగా.. 4,748 మంది పాస్ అయ్యారు. ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11,520 మంది స్టూడెంట్లకు 6,706 మంది ఉత్తీర్ణత సాధించారు.