ఇద్దరు మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలి: ప్రతిపక్ష కూటమి

ఇద్దరు మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలి: ప్రతిపక్ష కూటమి

మణిపూర్ సమస్యపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. వివిధ వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతి ముర్మును కోరింది. ప్రతిపక్ష నేతల బృందం అధ్యక్షుడు ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్ లో ప్రధాని మోదీ పర్యటించాలని ప్రతిపక్ష బృందం ప్రధాన డిమాండ్ గా రాష్ట్రతికి తెలిపినట్లు ఖర్గే పేర్కొన్నారు.

ఈరోజు లోక్‌సభలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023పై చర్చను కొనసాగించే ముందు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చట్టబద్ధమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి.  మరోవైపు రాజ్యసభలో దిగువ సభలో ఆమోద ముద్ర వేసిన మూడు బిల్లులను ఆమోదించనుంది. డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, అటవీ పరిరక్షణ సవరణ బిల్లు, జన్ విశ్వాస్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించనుంది.