ఎఫ్ 23 మోడల్లో కొత్త వెర్షన్ను ఒప్పో ఇండియాలో లాంచ్ చేసింది. ఒప్పో ఎఫ్23 5జీ స్పోర్ట్స్ ధర రూ. 24,999. ఈ నెల 18 నుంచి ఈ స్మార్ట్ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి.
ఈ ఫోన్లో 6.72 ఇంచుల డిస్ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ కర్వ్ స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్సెట్ను ఇందులో అమర్చారు.