
విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మారిముత్తు తీసిన ‘ఓరి దేవుడా’ చిత్రంతో మిథిలా పాల్కర్, ఆశా భట్ టాలీవుడ్కి పరిచయమవుతున్నారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వీరిద్దరూ ఇలా ముచ్చటించారు. మిథిల మాట్లాడుతూ ‘నాకు తెలుగు లాంగ్వేజ్ కొత్త. అయితే ఈ మూవీ జానర్తో పాటు ఇందులోని క్యారెక్టరైజేషన్ మాత్రం కొత్త కాదు. ఆల్రెడీ నాకు అలవాటైన క్యారెక్టరే కనుక తెలుగు నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టా. రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్లోని పాత్రల్ని ఎక్కడా ఫాలో అవ్వలేదు. ఓన్ స్టైల్లోనే నటించాం. విశ్వక్, ఆశతో సహా టీమ్ అందరం ఫ్రెండ్స్ అయ్యాం. నా ఫస్ట్ తెలుగు మూవీలోనే వెంకటేష్ గారు నటించడం హ్యాపీ. కానీ ఆయనతో కాంబినేషన్ సీన్స్ లేవు. సౌత్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నాను. భవిష్యత్తులో తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అని చెప్పింది.
ఆశ మాట్లాడుతూ ‘మీరా అనే పాత్ర పోషించా. ఒరిజినల్ వెర్షన్ ముందే చూసినప్పటికీ తెలుగులో చాలా మార్పులు చేశారు. కంటెంట్తో పాటు లొకేషన్స్, క్యారెక్టరైజేషన్స్ కూడా డిఫరెంట్. తమిళ సినిమా చూసినా కూడా ఈ మూవీ కొత్తగా ఉంటుంది. పూరి జగన్నాథ్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కాసేపు కనిపిస్తాను. ఎంతో కీలకమైన సీన్ అది. ఆయనతో కలిసి నటించడం హ్యాపీ. తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని చెప్పింది.