తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల బృందం..రక్షణ చర్యలపై పలు సూచనలు

తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల బృందం..రక్షణ చర్యలపై పలు సూచనలు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టును సోమవారం నిపుణుల బృందం పరిశీలించింది. చైర్మన్​ అశోక్​కుమార్​ గంజు, రిటైర్డ్  ఎస్ఈ సంజీవ్, భవానీ రాంశంకర్(డిజైన్స్) ప్రాజెక్టును పరిశీలించి, రక్షణ చర్యలపై పలు సూచనలు చేసింది. ప్రాజెక్టు స్థిరీకరణ ఆయకట్టు, క్యాచ్​మెంట్​​ ఏరియా, హయ్యస్ట్  ఇన్​ఫ్లో ఇతరత్రా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 ప్రాజెక్టు భద్రత నివేదికను తయారు చేసేందుకు ఈ నిపుణల బృందం వచ్చింది. ప్రాజెక్టులో చేపట్టాల్సిన అత్యవసర పనులపై టెక్నికల్​ టీమ్​ సభ్యులు ఇంజనీరింగ్  అధికారులకు పలు సూచనలు చేశారు. ఇరిగేషన్​ ఎస్ఈ ఏవీవీఎల్ ​నరసింహారావు, ఈఈ జానీ, డీఈ తిరుపతి, ఏఈలు సంపత్, సుమన, రవితేజ ఉన్నారు.