హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కోసం గత మూడు సంవత్సరాలలో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేశామని మసాలాలు, ఇన్స్టంట్ఫుడ్స్తయారీ కంపెనీ ఎంటీఆర్ ప్రకటించింది. భారతదేశంలో ఎంటీఆర్ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ సునయ్ భాసిన్ మాట్లాడుతూ తమకు గుంటూరులో ప్లాంటు, హైదరాబాద్లో ఔట్సోర్సింగ్ కేంద్రం ఉందన్నారు.
రూ.15 కోట్ల పెట్టుబడితో గుంటూరు ప్లాంటును విస్తరిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 1.5 లక్షల దుకాణాల్లో తమ వస్తువులు దొరుకుతాయని సునయ్ చెప్పారు.
