ఖుషీ నుంచి ఓసి పెళ్లామా సాంగ్ ప్రోమో రిలీజ్

ఖుషీ నుంచి ఓసి పెళ్లామా సాంగ్  ప్రోమో రిలీజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi).  క్లాసిక్ సినిమాలా దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఐదవ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. పబ్లో వచ్చే ఈ ఐదవ సింగిల్.. కాశ్మీర్లో ఫస్ట్ టైం తనని చూసిన..ముందెనుక చూడకుండా మనసిచ్చినా..బాబు మాట పక్కనెట్టి బయటికి వచ్చినా..లగ్గమెట్టీ కాపురాన్ని స్టార్ట్ చేసిన.. అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది. 

ఈ ప్రోమో చివర్లో ఓసి పెళ్లామా అంటూ వచ్చే లైన్తో.. వాహబ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్తో అంచనాలు పెంచేశారు మేకర్స్. పూర్తి సాంగ్ను ఆగస్టు 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్తో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా భర్తలు డ్యాన్స్ ఫ్లోర్ చేస్తారని..అందుకు మగజాతి అంతా సిద్ధంగా ఉండాలని టీమ్ ప్రకటించారు.హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్  కంపోజ్ చేయగా..డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్,టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ను ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో ఖుషి మూవీపై భారీ అంచానాలు ఉన్నాయి. 

నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.