
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనే చెప్పాలి. రోజు కొత్త కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంటాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా రకరాకాల కంటెంట్తో వందశాతం వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు కూడా ఓటీటీ రిలీజ్ కంటెంట్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఈ శుక్రవారం కూడా ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాటి డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం.
జీడీ చక్రవర్తి దయ సిరీస్
దయ తెలుగు వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. జేడీ చక్రవర్తి, కమల్ కామరాజ్, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు.
శ్రీసింహ భాగ్సాలే
ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా వచ్చిన భాగ్సాలే అనే మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. క్రైం కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.
నాగశౌర్య రంగబలి
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్యకు చాలా గ్యాప్ తరువాత హిట్ ఇచ్చిన సినిమా రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 7న థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆగస్టు 4 నుండి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తిరువీర్ పరేషాన్
‘మసూద మూవీతో సూపర్ హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. టాలీవుడ్ హాంక్ రానా సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా.. జూన్ 2న థియేటర్స్ లో విడుదలైంది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా.. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ మూవీ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది.